కొత్త సీఈఏ అనంత నాగేశ్వరన్‌

ABN , First Publish Date - 2022-01-29T08:56:07+05:30 IST

కొత్త సీఈఏ అనంత నాగేశ్వరన్‌

 

న్యూఢిల్లీ: కొత్త చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది డిసెంబరులో  కేవీ సుబ్రమణియన్‌ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో ఈ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రెడిట్‌ సూయిస్‌ గ్రూప్‌ ఏజీ, జూలియస్‌ బేర్‌ గ్రూప్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన నాగేశ్వరన్‌ శుక్రవారం నాడు సీఈఏగా బాధ్యతలు చేపట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 

Updated Date - 2022-01-29T08:56:07+05:30 IST