నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-07T12:35:20+05:30 IST

ఓ నవవధువు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు..

నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్/బర్కత్‌పుర : ఓ నవవధువు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాచిగూడ పోలీసుల వివరాల ప్రకారం... గాంధీనగర్‌ లంకలో నివాసం ఉంటున్న రాముకు బంగారు శ్రావణి అలియాస్‌ మాధవి(20)తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. శనివారం శ్రావణి ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారమందిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Updated Date - 2021-03-07T12:35:20+05:30 IST