ఎఫ్ఆర్వోల అసోసియేషన్ నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2021-01-25T07:21:14+05:30 IST
ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్ఆర్వోల) అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.
తిరుపతి(అటవీశాఖ), జనవరి 24: ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్ఆర్వోల) అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. తిరుపతి-కరకంబాడి రోడ్డులోని బయోట్రిమ్లో జరిగిన జనరల్బాడీ సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా పి.లక్ష్మీ నార్సు, ప్రధాన కార్యదర్శిగా జేవీ సుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పి.అమ్మన్నాయుడు, డీఎస్ సుదర్శన్, కోశాధికారిగా టి.ఉమామహేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్వీకే కుమార్, టి.ప్రభాకర్రెడ్డి, రీజనల్ సెక్రటరీలుగా పి.పోతురాజు, ఎస్సి.సుబ్బరాయుడులను ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని ఎఫ్ఆర్వోలకు జీతాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు సంబంధించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నూతన కార్యవర్గం పేర్కొంది.