నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-03-04T06:24:31+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసు మార్చాలని కోరుతూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని వేడుకున్నారు.
రాజన్నను వేడుకున్న మెదక్ జిల్లా రైతులు
మోదీ మనసు మార్చాలని ఆలయంలో పూజలు
వేములవాడ, మార్చి 3 : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసు మార్చాలని కోరుతూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని వేడుకున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన పాదయాత్రగా బయలుదేరిన ఎల్లాపూర్ గ్రామ రైతులు దాదాపు 110 కిలోమీటర్లు నడిచి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేముల వాడ రాజరాజేశ్వర స్వామి ఆలయా నికి చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా మోదీ మనసు మార్చాలని రాజరాజేశ్వరస్వామివారిని వేడుకున్నామని తెలి పారు. పంటకు కనీస మద్దతు ధర అమలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని పేర్కొన్నారు. రైతులు పబ్బ ప్రభాకర్రెడ్డి, పుట్టి రామకృష్ణయ్య, వెంకగౌడ్, రమేశ్, సత్తయ్య, యాదగౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.