నేటి నుంచి విధులకు హాజరుకావాలి

ABN , First Publish Date - 2021-03-03T04:45:32+05:30 IST

నేటి నుంచి విధులకు హాజరుకావాలి

నేటి నుంచి విధులకు హాజరుకావాలి

డీఈవో మహమ్మద్‌ అబ్దుల్‌ హై

భూపాలపల్లి టౌన్‌, మార్చి 2 : జిల్లాలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బుధవారం నుంచి విధులకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్‌ అబ్దుల్‌హై మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ ఆదేశాల మేరకు నేటి నుంచి ప్రతిరోజు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాలని కోరారు. అలాగే ఏదైనా ప్రాథమికోన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల స్థానంలో సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-03-03T04:45:32+05:30 IST