నేతాజీ ఆశయాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-01-24T06:34:36+05:30 IST

నేతాజీ ఆశయాలు సాధించాలని సూర్యాపేటలోని శ్రీరాంనగర్‌ దేవీ నవరాత్రోత్సవాల కమిటీ అధ్యక్షుడు నాగవేల్లి ప్రభాకర్‌ అన్నారు.

నేతాజీ ఆశయాలు సాధించాలి
గరిడేపల్లిలో నేతాజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న యువజన సంఘాల నాయకులు

జిల్లా వ్యాప్తంగా పరాక్రమ దివస్‌ 

సూర్యాపేట కల్చరల్‌, జనవరి 23: నేతాజీ ఆశయాలు సాధించాలని సూర్యాపేటలోని శ్రీరాంనగర్‌  దేవీ నవరాత్రోత్సవాల కమిటీ అధ్యక్షుడు నాగవేల్లి ప్రభాకర్‌ అన్నారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆదివారం శ్రీరాం నగర్‌లో  పరాక్రమ దివస్‌ను నిర్వహించారు. ఈ సంద ర్భంగా నేతాజీ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివా ళులర్పించి మాట్లాడారు.  సుశిక్షితులైన అజాద్‌ హిందూ ఫౌజ్‌  సైన్యంతో ఆంగ్లేయులకు సింహస్వప్నంగా నిలిచి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో నేతాజీ కీలకపాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో సభ్యులు సుభాష్‌, అంజనరెడ్డి, జితేందర్‌రెడ్డి, వీరన్న, ఉపేందర్‌, వెంకటేశ్వర్లు, చలపతిరావు, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌రావు, చక్రి, శీనయ్య, జగన్‌ పాల్గొన్నారు.

గరిడేపల్లి రూరల్‌: నేతాజీ జయంతిని యూత్‌ కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు బత్తిని రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని పొనుగోడు, గడ్డిపల్లి, గ్రామాల్లో నేతాజీ విగ్రహాలకు నివాళుల ర్పించి మాట్లాడారు.  కార్యక్రమంలో కొలిపాక జగ దీష్‌, మనోజ్‌, అఖిల్‌, నితిన్‌, గణేష్‌, వెంకటేశ్‌, అజయ్‌, గౌతం తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2022-01-24T06:34:36+05:30 IST