‘మా నాన్న జయంత్యుత్సవాలు నిర్వహించడం ఆనందమే..’ అయితే.. : అనితా బోస్

ABN , First Publish Date - 2021-01-24T02:35:54+05:30 IST

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125 జయంత్యుత్సవాల నిర్వహణపై ఆయన కుమార్తె అనితా బోస్ స్పందించారు. ఇలా జయంత్యుత్సవాలు

‘మా నాన్న జయంత్యుత్సవాలు నిర్వహించడం ఆనందమే..’ అయితే.. : అనితా బోస్

న్యూఢిల్లీ : నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125 జయంత్యుత్సవాల నిర్వహణపై ఆయన కుమార్తె అనితా బోస్ స్పందించారు. ఇలా జయంత్యుత్సవాలు నిర్వహించడం అత్యంత ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవం లభించడం ఆనందంగా ఉందని, జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ప్రధాని మోదీ కోల్‌కతాకు రావడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆయనకు లభించాల్సినంత గౌరవం మాత్రం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా... తన తండ్రిని దేశ ప్రజానీకం గుర్తుంచుకోవడం, ఆయన ప్రేమించడం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోందని, దేశం కోసం నేతాజీ ఎంతో చేశారని గుర్తు చేసుకున్నారు.


ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం లభించి, ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఆయనకు సంబంధించిన చాలా పత్రాలు ఇంకా అందుబాటులోకి రాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు బీజేపీ, ఇటు తృణమూల్ రెండూ నేతాజీతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే అటు మోదీ, ఇటు మమత ఇద్దరూ నేతాజీని ఆరాధించేవారే అని, అయితే ఎన్నికల ముందు ఇలా చేయడం ఏమీ బాగోలేదని ఆమె వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-24T02:35:54+05:30 IST