నిజామాబాద్‌లో ఘనంగా మిమిక్రీ దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-29T04:12:09+05:30 IST

నిజామాబాద్: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌లో ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నిజామాబాద్‌లో ఘనంగా మిమిక్రీ దినోత్సవం

నిజామాబాద్: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ జయంతి సందర్భంగా  నిజామాబాద్ శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌లో ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మిమిక్రీ కళాకారులు మిమిక్రీపై చిన్నారులకు అవగాహన కల్పించారు. మిమిక్రీతో విద్యార్ధులను అలరించారు. మిమిక్రీ తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిమిక్రీ కళాకారులను సన్మానించారు. సమాఖ్య స్థాపించి 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా "జాదు యుగంధర్" రంగనాథ్, రాబర్ట్, ఆనంద్, దీక్షిత, శ్రీనివాస్‌లను సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కంఠిపూడి విజయ్ కుమార్ మిమిక్రి కళాకారులను పూలమాలలతో సత్కరించారు. శాలువా కప్పి మెమొంటోలు అందజేశారు. నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్‌ కార్యదర్శి సముద్రాల మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-29T04:12:09+05:30 IST