సహకరించలేదని తన దేశస్థుడిపైనే దాడి.... పేగులు బయటకొచ్చేశాయ్

ABN , First Publish Date - 2021-10-24T01:57:12+05:30 IST

షెల్టర్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడో వ్యక్తి. నిందితుడు,

సహకరించలేదని తన దేశస్థుడిపైనే దాడి.... పేగులు బయటకొచ్చేశాయ్

థానే: షెల్టర్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడో వ్యక్తి. నిందితుడు, బాధితుడు ఇద్దరూ నేపాలీలే. మహారాష్ట్రలోని థానేలోజరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఓ వ్యక్తి శరీరంపై రక్తపు మరకలు కనిపించడంతో ఏం జరిగిందని, ఆ రక్తపు మరకలు ఏంటని స్థానికులు ప్రశ్నించారు. అతడు తడబడుతుండగా ఓ వ్యక్తి చేతిలో పేగులు పట్టుకుని రక్తమోడుతూ కనిపించాడు. 


స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. బాధితుడు పద్మ బహదూర్ తపోలా (49) కుటుంబంతో కలిసి నగరంలోని నీలమ్ ఎస్‌హెచ్ఎస్ నివసిస్తూ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో నిందితుడు ఇంద్రమోహన్ భర్ములే బుడా (40) అతడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తాను ఉండేందుకు, తినేందుకు ఏర్పాట్లు చూడాలని కోరాడు.  


బాధితుడు అందుకు నిరాకరించడంతో బుడా ఒక్కసారిగా కత్తితో తపోలా కడపులో బలంగా పొడిచాడు. దీంతో అతడి లోపలికి భాగాలు బయటపడ్డాయి. స్థానికులు వెంటనే అతడిని కల్వా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-24T01:57:12+05:30 IST