అమితాబ్ త్వరగా కోలుకోవాలి: నేపాల్ ప్రధాని ఓలీ
ABN , First Publish Date - 2020-07-12T22:40:48+05:30 IST
ఖాట్మండూ: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ త్వరగా కోలుకోవాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆకాంక్షించారు.
ఖాట్మండూ: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ త్వరగా కోలుకోవాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆకాంక్షించారు. భారత్-నేపాల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అమితాబ్ కుటుంబం కోలుకోవాలని ఓలీ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమితాబ్ భార్య జయాబచ్చన్కు తప్ప బచ్చన్ కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారిద్దరికీ ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు. జయాబచ్చన్కు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.