నిజమైన అయోధ్య నేపాల్లో ఉంది.. రాముడు నేపాలీ: ఓలీ
ABN , First Publish Date - 2020-07-14T03:54:48+05:30 IST
ఖాట్మండూ: నేపాల్లో కేపీ శర్మ మరోసారి కలకలం రేపారు. భారత్లో ఉన్నది నకిలీ అయోధ్య అని నిజమైన అయోధ్య నేపాల్లో ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
ఖాట్మండూ: నేపాల్లో కేపీ శర్మ మరోసారి కలకలం రేపారు. భారత్లో ఉన్నది నకిలీ అయోధ్య అని నిజమైన అయోధ్య నేపాల్లో ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్ బిర్గుంజ్కు పశ్చిమాన ఉన్న అయోధ్య రాజ కుమారుడు రాముడికి సీతను ఇచ్చి వివాహం చేశామని చెప్పారు. రాముడు కూడా నేపాలీ అని ఓలీ చెప్పారు. తన అధికారిక నివాసంలో భానుభక్త ఆచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమను సాంస్కృతికంగా కూడా తొక్కేసేందుకు భారత్ యత్నిస్తోందన్నారు.
ఓలీ ఇటీవలే భారత భూభాగాలను తమవంటూ మ్యాపు విడుదల చేసి కలకలం రేపారు.