భారత్పై మళ్లీ విరుచుకుపడిన నేపాల్ ప్రధాని
ABN , First Publish Date - 2020-05-26T22:19:55+05:30 IST
నేపాల్ ప్రధాని కేపీ శర్మ భారత్పై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా ప్రబలడానికి భారతే
కఠ్మాండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్పై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా ప్రబలడానికి భారతే కారణమని మరోమారు ఆరోపించారు. ఇతర దేశాల వల్లే తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణాసియాలోని మిగతా దేశాలతో పోలిస్తే నేపాల్లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. దేశ జనాభాలోని రెండు శాతం మంది ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కరోనా బాధితులకు క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన నేపాలీలను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, నేపాల్ ప్రధాని ఓలి గతంలోనూ భారత్పై పలు విమర్శలు చేశారు. చైనా, ఇటలీ కంటే భారత్ నుంచి వ్యాపించే వైరస్ మరింత ప్రమాదకరమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.