నేపాల్‌లో ఆగస్టు 5 నుంచి దేశీయ విమాన సర్వీసుల రాకపోకలు

ABN , First Publish Date - 2020-07-18T12:08:10+05:30 IST

ఆగస్టు 5వతేదీ నుంచి విమాన సర్వీసుల రాకపోకలను పునరుద్ధరించాలని నేపాల్ సర్కారు నిర్ణయించింది.....

నేపాల్‌లో ఆగస్టు 5 నుంచి దేశీయ విమాన సర్వీసుల రాకపోకలు

ఖాట్మండు (నేపాల్): ఆగస్టు 5వతేదీ నుంచి  విమాన సర్వీసుల రాకపోకలను పునరుద్ధరించాలని నేపాల్ సర్కారు నిర్ణయించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నిలిపివేసిన దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 5వతేదీ నుంచి పునర్ ప్రారంభించాలని నేపాల్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 5వతేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు, ఆగస్టు 17 నుంచి అంతర్జాతీయవిమాన సర్వీసులను నడిపేందుకు తాత్కాలిక ప్రణాళిక రూపొందించామని నేపాల్ పర్యాటక శాఖ మంత్రి యోగేష్ భట్టారాయ్ చెప్పారు. ఖాట్మండు నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని మంత్రి వివరించారు. నేపాల్ దేశంలో ఈ వారం 6 వేల మందికి కరోనా సోకింది. నేపాల్ దేశంలో విమానాల రాకపోకల పునరుద్ధరణతో పర్యాటక రంగానికి ఊపు వస్తుందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-07-18T12:08:10+05:30 IST