నెల్లూరును విద్యాహబ్‌గా మార్చాలి

ABN , First Publish Date - 2020-08-02T11:44:12+05:30 IST

ముక్కలవుతున్న రాష్ట్ర రాజధాని నుంచి విద్యాకేంద్రాలను నెల్లూరుకు తరలించి విద్యాహబ్‌గా మార్చాలని పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి ..

నెల్లూరును విద్యాహబ్‌గా మార్చాలి

నెల్లూరు(విద్య) ఆగస్టు 1 : ముక్కలవుతున్న రాష్ట్ర రాజధాని నుంచి విద్యాకేంద్రాలను నెల్లూరుకు తరలించి విద్యాహబ్‌గా మార్చాలని పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.తిరుమలయ్య ఒక ప్రకటనలో కోరారు. అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మొత్తం విద్యావ్యవస్థనంతా నెల్లూరులో ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి కార్యాలయం, పరిపాలనా భవనాలు  జిల్లాకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-08-02T11:44:12+05:30 IST