Nellore: కారును వెనుక నుంచి ఢీకొన్న రెండు బస్సులు

ABN , First Publish Date - 2022-06-17T16:58:06+05:30 IST

జిల్లాలోని సంగం మండలం సిద్ది పురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

Nellore: కారును వెనుక నుంచి ఢీకొన్న రెండు బస్సులు

నెల్లూరు: జిల్లాలోని సంగం మండలం సిద్ది పురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనుక నుండి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. కారు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-06-17T16:58:06+05:30 IST