నెల్లూరులో మోరాయిస్తున్న ఈవీఎంలు..ఆగిన పోలింగ్
ABN , First Publish Date - 2021-04-17T13:33:04+05:30 IST
జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎలు మోరాయించడంతో...
నెల్లూరు: జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎలు మోరాయించడంతో వాకాడు, నిడిగుర్తి, పొదలకూరు, నాయుడుపేటల్లో పోలింగ్ ఇంకా మొదలుకాలేదు. ఓటర్లతో పోలింగ్బూత్ వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ఈవీఎంలను సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది తంటాలు పడుతున్నారు.