రాజస్థాన్‌ నిరాహారదీక్షలో నెల్లూరు ప్రజాసంఘాలు

ABN , First Publish Date - 2021-01-14T04:49:45+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాజస్థాన్‌ రాష్ట్రం సరిహద్దుల్లోని షెహణాపూర్‌లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం జరిగిన రిలే నిరాహార దీక్షలో నెల్లూరు జిల్లా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రాజస్థాన్‌ నిరాహారదీక్షలో నెల్లూరు ప్రజాసంఘాలు
నిరసన దీక్షలో ప్రజాసంఘాల నేతలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 13: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాజస్థాన్‌ రాష్ట్రం సరిహద్దుల్లోని షెహణాపూర్‌లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం జరిగిన రిలే నిరాహార దీక్షలో నెల్లూరు జిల్లా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మలి వెంగయ్య, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కే రషీద్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవీ రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:49:45+05:30 IST