Pennanadiలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు
ABN , First Publish Date - 2022-06-06T16:59:59+05:30 IST
ల్లాలోని బుచ్చి మండలం జొన్నవాడ పెన్నానదిలో నిన్న ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
నెల్లూరు: జిల్లాలోని బుచ్చి మండలం జొన్నవాడ పెన్నానదిలో నిన్న ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన యువకులు రాకేష్(17), మున్నా(18)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు... గజఈతగాళ్లతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇంత వరకు యువకుల ఆచూకీ లభించలేదు.