నెల్లూరు లోటస్ కోవిడ్ సెంటర్లో కరోనా రోగి మృతి
ABN , First Publish Date - 2020-09-24T03:04:53+05:30 IST
బస్టాండు దగ్గర లోటస్ కోవిడ్ సెంటర్లో కరోనా రోగి మృతి చెందారు. ఇనమడుగుకు చెందిన ప్రభాకర్ (55)కు జ్వరం, జలుబు రావడంతో..
నెల్లూరు: బస్టాండు దగ్గర లోటస్ కోవిడ్ సెంటర్లో కరోనా రోగి మృతి చెందారు. ఇనమడుగుకు చెందిన ప్రభాకర్ (55)కు జ్వరం, జలుబు రావడంతో కుటుంబ సభ్యులు లోటస్ కోవిడ్ సెంటర్లో చేర్పించారు. ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని డబ్బు గుంజుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు తమకు కరోనా లేకున్నా ఉందని చెప్పారని కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ మృతికి కోవిడ్ సెంటర్ సిబ్బందే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.