నెల్లూరు కేవీకేకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు
ABN , First Publish Date - 2021-01-21T05:02:10+05:30 IST
నెల్లూరు భక్తవత్సలనగర్లోని కృషి విజ్ఞాన కేంద్రానికి 2019-20 సంవత్సరానికిగాను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.
నెల్లూరు(వ్యవసాయం), జనవరి 20 : నెల్లూరు భక్తవత్సలనగర్లోని కృషి విజ్ఞాన కేంద్రానికి 2019-20 సంవత్సరానికిగాను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. 12 ఏళ్లుగా అక్కడి శాస్త్రవేత్తల బృందం జిల్లాలోని రైతులు, గ్రామీణ యువతకు అందుబాటులో ఉంటూ పంటల సాగుకు మేలైన సూచనలివ్వడంతో ఈ గుర్తింపు లభించింది. తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానంలో బుధవారం జరిగిన 50వ పరిశోధన, విస్తరణ కార్యక్రమంలో ఈ అవార్డును ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్థన్రెడ్డి, విస్తరణ సంచాలకుడు డాక్టర్ పీ రాంబాబు నుంచి నెల్లూరు కేవీకే సమన్వయకర్త డాక్టర్ వీ సుమతి అందుకున్నారు.