తాడేపల్లి చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ
ABN , First Publish Date - 2022-04-20T21:12:04+05:30 IST
నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లి చేరింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.
అమరావతి: నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లి చేరింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇటీవల మాజీమంత్రి అనిల్, మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డిలపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ జగన్ క్యాంపు ఆఫీస్కు పిలిపించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అనిల్ జగన్ను కలిశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలపై సీఎంకు అనిల్ వివరిచ్చినట్లు తెలుస్తోంది.