మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా పోలీసుల దుశ్శాసనపర్వం
ABN , First Publish Date - 2022-03-08T14:15:12+05:30 IST
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా పోలీసుల దుశ్శాసనపర్వం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా పోలీసుల దుశ్శాసనపర్వం వెలుగులోకి వచ్చింది. కలిగిరి మండలం పెద్ద అన్నలూరులో పోలీసులు ఈ దుశ్శాసనపర్వానికి పాల్పడ్డారు. ఓ స్థల వివాదంలో నడిరోడ్డుపై ఓ మహిళ చీరను పోలీసులు లాగారు. గ్రామస్తులు వేడుకుంటున్నా అధికారులు కనికరించలేదు. వివరాల్లోకి వెళ్తే.. అన్నలూరు గ్రామంలో అక్రమ లే అవుట్ వేసి, గ్రామకంఠం భూమిలో వైసీపీ నేత సిద్ధారెడ్డి వీరారెడ్డి రోడ్డు వేశాడు. ఇదేంటనీ అడ్డుకోబోయిన గ్రామస్తులపై దౌర్జన్యం చేశాడు. ఈ స్ధల వివాదం జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్నా సిద్ధారెడ్డి వీరారెడ్డి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అండగా ఉండడంతో అతను ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.