నెల్లూరు జిల్లా: ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-02-23T17:51:03+05:30 IST
నెల్లూరు జిల్లా: ఉదయగిరిలో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి.
నెల్లూరు జిల్లా: దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయగిరిలోని మేకాపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ప్రాంగణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
సౌమ్యుడు, వివాద రహితుడు, అందరివాడిగా పేరు తెచ్చుకున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఇకలేరన్న సంగతి తెలిసి సింహపురి కన్నీరు పెట్టింది. ఆయనను కడసారి చూసేందుకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు, నేతలు, అధికారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా గౌతమ్రెడ్డి గుండెపోటుతో సోమవారం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో మంగళవారం నెల్లూరుకు తీసుకొచ్చారు.