ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పనితీరు, వ్యవహారంపై వైసీపీ నేతల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-02-16T20:40:06+05:30 IST
కోవూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరాయి.
నెల్లూరు జిల్లా: కోవూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పనితీరు, వ్యవహారంపై వైసీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. సొంతపార్టీ నేతలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కొమరిక గ్రామ బూత్ కన్వీనర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.