నెల్లూరు...ఏఎస్ పేటలో విషాదం..

ABN , First Publish Date - 2022-01-28T16:05:43+05:30 IST

మతిస్థిమితం లేని వ్యక్తుల ప్రైవేటు సంరక్షణ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

నెల్లూరు...ఏఎస్ పేటలో విషాదం..

నెల్లూరు: ఏఎస్ పేటలో విషాదం నెలకొంది. మతిస్థిమితం లేని వ్యక్తుల ప్రైవేటు సంరక్షణ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ముష్రఫ్ అనే మహిళ సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మానసిక స్థితి నయం అవుతుందన్న నమ్మకంతో ఏఎస్ దర్గా వద్దకు మతిస్థిమితం లేని వ్యక్తులను వారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళుతుంటారు. కాగా ఏఎస్ పేటలో అనధికారికంగా ఈ కేంద్రాలు వెలిశాయి. బాధిత కుటుంబాల నుంచి వేలకు వేలు డబ్బులు తీసుకుని బాధితులను నిర్వాహకులు పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-01-28T16:05:43+05:30 IST