నెల్లూరు జిల్లా: 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-15T18:18:23+05:30 IST

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

నెల్లూరు జిల్లా: 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా: వైసీపీ శ్రేణులు బరితెగిస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను వైసీపీ శ్రేణులు చెప్పడం వివాదాస్పదంగా మారింది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళుతున్న వైసీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని అక్కడి నుంచి పంపించారు. గొడవకు సంబంధం లేని టీడీపీ అభ్యర్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

Updated Date - 2021-11-15T18:18:23+05:30 IST