-
-
Home » Andhra Pradesh » Nellore » Nellore district-MRGS-AndhraPradesh
-
Nellore: పేరుకే సర్పంచులు.. పెత్తనం వైసీపీ నేతలదే
ABN , First Publish Date - 2022-05-03T20:22:32+05:30 IST
నెల్లూరు జిల్లా: సర్పంచులను వైసీపీ నేతలు, అధికారులు అవమానిస్తున్నారు.
నెల్లూరు జిల్లా: సర్పంచులను వైసీపీ నేతలు, అధికారులు అవమానిస్తున్నారు. పేరుకే వారు సర్పంచులు, కానీ పెత్తనమంతా వైసీపీ నాయకలదే.. అన్ని పనులు నిర్వహించడంతోపాటు సర్పంచ్ సంతకాలు పోర్జరీ చేసి నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండలం, వాసలీ గ్రామంలో ఉపాధి నిధులను పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసినట్లు సర్పంచ్ ఆరోపిస్తున్నారు. దళిత సర్పంచ్ రమాదేవి సంతకం పోర్జరీ చేసి రూ. 8 లక్షలు స్వాహా చేశారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అభివృద్ధికి అధికారులు, స్థానిక నేతలు కొందరు సహకరించడంలేదని ఆరోపిస్తున్నారు.