ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ ఫోన్
ABN , First Publish Date - 2021-03-02T21:17:58+05:30 IST
సెల్ ఫోన్ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఫోన్ మాట్లాడుతూ..
నెల్లూరు: సెల్ ఫోన్ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఫోన్ మాట్లాడుతూ రైల్వే గేటు దాటుతున్న యువకుడు.. రెండు రైళ్లు ఒకేసారి రావడాన్ని గమనించలేదు. ఓ ట్రాక్ దాటి మరో ట్రాక్పైకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. బాధితుడు బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అల్లాభక్ష్గా పోలీసులు గుర్తించారు. కాగా యువకుడి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం.