నెల్లూరులోని దక్షిణపురంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-07-09T00:05:31+05:30 IST

జిల్లలోని కోట మండలం దక్షిణపురం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాశీపురం రీచ్ నుంచి ఇసుక తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే ఇసుకను తరలిస్తున్నట్లు డిప్యూటీ

నెల్లూరులోని దక్షిణపురంలో ఉద్రిక్తత

నెల్లూరు: జిల్లలోని కోట మండలం దక్షిణపురం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాశీపురం రీచ్ నుంచి ఇసుక తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే ఇసుకను తరలిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ రోజ్మండ్ వెల్లడించారు. అయినప్పటికీ వినకుండా జాండ్రపేట, దక్షిణపురం, తిన్నెలపూడి ప్రజలు డిప్యూటీ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, అధికారులు భారీగా మోహరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం జగన్ ఇటీవల కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఇసుకను ముందస్తుగా స్టాక్ చేసి పెడుతున్నారు.

Updated Date - 2020-07-09T00:05:31+05:30 IST