రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెడుతోంది..: శ్రీనివాస్ రావు

ABN , First Publish Date - 2022-09-04T18:07:56+05:30 IST

రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ(Ysrcp) తాకట్టు పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రావు(CPM State Secretary Srinivas Rao) ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెడుతోంది..: శ్రీనివాస్ రావు

Nellore: రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ(Ysrcp) తాకట్టు పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రావు(CPM State Secretary Srinivas Rao) ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు జరిగే దేశ రక్షణ భేరిలో జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు. అన్నక్యాంటీన్లపై దాడి సరికాదని, అన్నం పెట్టేవారి మీద దాడులు చేయడం దుర్మార్గమని శ్రీనివాస్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-04T18:07:56+05:30 IST