చెత్త నగరంలా నెల్లూరు

ABN , First Publish Date - 2021-01-25T05:28:03+05:30 IST

నెల్లూరు నగరం ఎక్కడ చూసిన చెత్తతో నిండి ఉందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, కార్పొరేషన్‌ అధికారులు చెత్త నగరంగా మారుస్తున్నారని జనసేన నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆరోపించారు.

చెత్త నగరంలా నెల్లూరు
పేరుకు పోయిన చెత్తను పరిశీలిస్తున్న జనసేన నాయకులు

జనసేన నాయకుడు కేతంరెడ్డి 

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 24: నెల్లూరు నగరం ఎక్కడ చూసిన చెత్తతో నిండి ఉందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, కార్పొరేషన్‌ అధికారులు చెత్త నగరంగా మారుస్తున్నారని జనసేన నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆరోపించారు. బారకాస్‌, కలెక్టరేట్‌, చిన్నబజార్‌, పెద్దబజార్‌ తదితర ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు ఆదివారం పర్యటించారు. చెత్తకుండీల నిర్వహణను పరిశీలించారు. వినోద్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్‌ సరుకుల పంపిణీ కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసి వాహనాలు కొనుగోలు చేసిన ప్రభుత్వం, కార్పొరేషన్‌ పరిధిలో చెత్తను తొలగించేందుకు మాత్రం సరైన వాహనాలను కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. తక్షణం పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్‌రెడ్డ్డి, కాకు మురళీ రెడ్డి, శ్రీకాంత్‌ యాదవ్‌, హేమంత్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:28:03+05:30 IST