Nellore: బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య వాగ్వివాదం

ABN , First Publish Date - 2021-11-15T16:20:21+05:30 IST

జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Nellore: బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య వాగ్వివాదం

నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం లోపల వైసీపీ అభ్యర్థులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం నిర్వహించగా... బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో సీఐ కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని వెళ్లగొట్టారు. కాగా గొడవకు సంబంధంలేని తెలుగు దేశం అభ్యర్థిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-11-15T16:20:21+05:30 IST