Nellore: ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ
ABN , First Publish Date - 2021-11-14T17:10:40+05:30 IST
జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మం కాగులపాడు ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది.
నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మం కాగులపాడు ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. మద్యం దుకాణం వద్ద ఉన్న వాచ్మెన్పై దాడి చేసిన దుండగులు.. తాళాలు పగులగొట్టి 1,30000 విలువచేసే మద్యం సీసాలను దొంగలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.