-
-
Home » Andhra Pradesh » Nellore » nellore andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
బైక్పై మృతదేహాన్ని తరలించిన ఘటనపై సీఐ స్పందన
ABN , First Publish Date - 2022-05-05T17:52:41+05:30 IST
బాలుడు మృతదేహాన్ని బైక్పై తీసుకువెళ్లిన ఘటనపై బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు స్పందించారు.
నెల్లూరు: బాలుడు మృతదేహాన్ని బైక్పై తీసుకువెళ్లిన ఘటనపై బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు స్పందించారు. 108 సిబ్బందిని బ్రతిమిలాడినా నిరాకరించింది వాస్తవమే అని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నావారిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికే 108 అంబులెన్సులు అని చెప్పుకొచ్చారు. చాలా మంది ఆటో వారిని బ్రతిమిలాడిన విషయం కూడా వాస్తవమే అని అన్నారు. ఆటో వారూ పబ్లిక్ సర్వెంట్సే అని తెలిపారు. ఎస్పీ విజయారావు సూచనల మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఆటోలవారు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే, తమ దృష్టికి తేవాలని, కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు.