నెల్లూరులో వైసీపీ నేతల ఆధిపత్య పోరుపై జగన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-04-20T18:30:20+05:30 IST
నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదం, మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య మాటల యుద్ధంపై మండిపడ్డారు. ఈ విషయానికి సంబంధించి తాడేపల్లి రావాలని మంత్రి కాకాణి, అనిల్లకు సీఎం నుండి పిలుపు అందింది. కాకాణి, అనిల్లకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు నేతలు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. సీఎం జగన్తో మంత్రి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ భేటీ కానున్నారు.