పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం
ABN , First Publish Date - 2020-12-03T19:08:09+05:30 IST
పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం
నెల్లూరు: జిల్లాలోని కొడవలూరు పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం రేగింది. కోవూరు సీఐ రామారావును వీఆర్కు పంపుతూ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొడవలూరు ఎస్ఐ జిలానీ, ఎస్బీ ఎస్ఐ వెంకటసాయి, కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీకాంత్లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. కొడవలూరు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట వ్యవహారాల్లో పోలీసుల పాత్ర ఉండటంతో విచారణకు ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశించారు.