పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం

ABN , First Publish Date - 2020-12-03T19:08:09+05:30 IST

పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం

పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం

నెల్లూరు: జిల్లాలోని కొడవలూరు పేకాట వ్యవహారంపై పోలీస్ అధికారుల్లో కలకలం రేగింది. కోవూరు సీఐ రామారావును వీఆర్‌కు పంపుతూ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొడవలూరు ఎస్ఐ జిలానీ,  ఎస్బీ ఎస్‌ఐ వెంకటసాయి, కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీకాంత్‌లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. కొడవలూరు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట వ్యవహారాల్లో పోలీసుల పాత్ర ఉండటంతో విచారణకు  ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశించారు.


Updated Date - 2020-12-03T19:08:09+05:30 IST