భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన భార్య.. పక్కింటి వాడితో పరిచయం.. చివరికి ప్రేమకథలో ట్విస్ట్

ABN , First Publish Date - 2021-10-22T13:07:12+05:30 IST

భార్యాభర్తల మధ్య గొడవ అనగానే.. అవి చాలా సహజం అని అందరూ అంటారు. కానీ వారి గొడవలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే దుర్మార్గులు కూడా ఉన్నారు. అలాంటి ఒక ఘటనే మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగు చూసింది...

భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన భార్య.. పక్కింటి వాడితో పరిచయం.. చివరికి ప్రేమకథలో ట్విస్ట్

భార్యాభర్తల మధ్య గొడవ అనగానే.. అవి చాలా సహజం అని అందరూ అంటారు. కానీ  వారి గొడవలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే దుర్మార్గులు కూడా ఉన్నారు. అలాంటి ఒక ఘటనే మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగు చూసింది. 


గ్వాలియర్‌ నగర సమీపంలోని గదాయిపురా అనే గ్రామానికి చెందిన లలిత(22, పేరు మార్చబడినది) తన భర్తతో గొడవ పడి కొంతకాలం క్రితం పుట్టింటికి వచ్చేసింది. అక్కడ పొరిగింట్లో మునీంద్ర(30) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మునీంద్ర తరుచూ లలిత ఇంటికి వచ్చేవాడు. లలిత తన భర్తకు దూరంగా ఉండడంతో.. మునీంద్ర ఆమెపై సానుభూతి చూపించేవాడు. లలిత పట్ల ఆమె భర్త చాలా తప్పుగా ప్రవర్తించాడని ఆమెతో చెప్పేవాడు. అలా లలిత అతని మంచి మాటలు విని అతనితో సన్నిహితంగా ఉండేది. 


ఒకరోజు లలిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మునీంద్ర అక్కడికి వచ్చాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు లలిత అంగీకరించలేదు. ఆ తరువాత ఆమె లేకుండా తాను ఉండలేనని చెప్పి దెగ్గరయ్యాడు. లలితకు ఇష్టం లేకపోయినా ఆమెను బలవంతంగా తాకాడు. మాటలలో పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. లలిత ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబుతానని అనడంతో.. మునీంద్ర ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.


ఆ తరువాత వారిద్దరూ ప్రేమికులుగా మారారు. చాలా సార్లు శృంగారం చేసుకున్నారు. అలా కొంతకాలం తరువాత లలిత పెళ్లి ఎప్పుడు అని మునీంద్ర ప్రశ్నించడం మొదలుపెట్టింది. దానికి మునీంద్ర ప్రతీసారి సమాధానం దాటేసే వాడు. అతని మాటలకు విసిగిపోయిన లలిత అతనితో ఇక ఉండనని చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత ఒక రోజు మునీంద్ర లలితను ఒంటరిగా కలుసుకొని తన కోరిక తీర్చమన్నాడు. దానికి లలిత అంగీకరించక పోవడంతో ఆమెను కొట్టాడు, బలవంతం చేశాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడు.


దీంతో లలిత తన తల్లిదండ్రులను తీసుకొని మరో ప్రాంతంలో ఇల్లు మారిపోయింది. అది తెలుసుకొని మునీంద్ర అక్కడికి కూడా వచ్చాడు. తన నుంచి తప్పించుకోలేవని.. లలితను బెదిరించాడు. తను చెప్పినప్పుడల్లా తనతో శృంగారం చేయాల్సిందేనని.. లేకపోతే అందరికీ తను చెడిపోయిన ఆడదానిగా చెబుతానని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. ఇక మునీంద్ర చిత్రహింసలు భరించలేననుకున్న లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మునీంద్రను అరెస్టు చేయడానికి వెళ్లగా అతను పరారీ ఉన్నట్ల తెలిసింది. మునీంద్ర గురించి సమాచారం సేకరించిన పోలీసులు అతడిన త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. 


Updated Date - 2021-10-22T13:07:12+05:30 IST