ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే.. పారిపోయి పెళ్లి చేసుకుని వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-16T01:20:13+05:30 IST

ఆమె తమ పక్కింట్లో ఉండే అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి కూడా ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఇంట్లో పెద్దవారికి తెలియకుండా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే.. పారిపోయి పెళ్లి చేసుకుని వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె తమ పక్కింట్లో ఉండే అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి కూడా ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఇంట్లో పెద్దవారికి తెలియకుండా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చిన్నతనం నుంచి వీరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. ఈ విషయం ఇంట్లో పెద్దవారికి తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భయపడ్డారు. ఈ క్రమంలో వయసుకురాగానే ఇద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో తన గురించి పెళ్లికూతురు ప్రియాంశు మాట్లాడింది. తామిద్దరం చిన్నతనం నుంచి ప్రేమించుకుంటున్నామని, తమకు అందరూ మద్దతుగా నిలవాలని కోరింది. తాను మేజర్ అని, తన జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు తనకు ఉంటుందని స్పష్టంచేసింది. ఈ ఘటన బిహార్‌లోని సాసారామ్ ప్రాంతలో వెలుగు చూసింది.


ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. రెండు కుటుంబాలు గొడవకు దిగాయి. ఈ కుటుంబాల మధ్య బాహాబాహీ గొడవ జరిగింది. కర్రలు, లాఠీలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ గుంపు గొడవ వల్ల ఆ ప్రాంతం మొత్తం రణక్షేత్రంగా మారింది. ఈ నేపథ్యంలో యువతీయువకుల పెళ్లి వీడియో మరింత వైరల్ అయింది. ఈ వీడియోలో అమ్మాయి మాట్లాడుతూ.. తన కుటుంబం ఆర్కెస్ట్రా నడుపుతారని, దీంతోపాటు వేశ్యావృత్తి కూడా చేస్తారని ఆ అమ్మాయి వెల్లడించింది. తనను కూడా ఆ వృత్తిలో దింపేందుకు కుటుంబం ప్రయత్నిస్తోందని, ఆ నరకం నుంచి తప్పించుకోవడానికే పారిపోయి వచ్చానని ఆమె పేర్కొంది. కుటుంబాల నుంచి తమకు ప్రాణహానీ ఉందని అంటున్న ఈ జంట.. పోలీసుల నుంచి రక్షణ కావాలని ఈ జంట కోరుతోంది.

Updated Date - 2021-08-16T01:20:13+05:30 IST