బెంగాల్‌ వచ్చే వారికి కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-05-07T15:54:36+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి రైలు ద్వారా వస్తున్న ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని....

బెంగాల్‌ వచ్చే వారికి కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి

కోల్‌కతా (పశ్చిమబెంగాల్) : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి రైలు ద్వారా వస్తున్న ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని సర్కారు ఆదేశించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని, వారినే అనుమతిస్తామని పశ్చిమబెంగాల్ సర్కారు తాజాగా నిర్ణయించింది.కరోనా కట్టడి కోసం బెంగాల్ తోపాటు పలు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైళ్లలో ఎక్కే ప్రయాణికులకు థర్మల్  స్కానింగ్ చేయాలని, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉన్న వారినే రైళ్లలోకి అనుమతించాలని పశ్చిమబెంగాల్ హోం శాఖ కార్యదర్శి హెచ్ కే దివేది రైల్వే ఉన్నతాధికారులకు రాసిన లేఖలో కోరారు. బెంగాల్ ఎన్నికల పర్వం వల్ల తాజాగా మొత్తం 1,21,872 కరోనా కేసులు నమోదవడంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించింది.

Updated Date - 2021-05-07T15:54:36+05:30 IST