అడయార్(చెన్నై): ‘నీట్’ రాసిన విద్యార్థిని అదృశ్యం త (19) అనే విద్యార్థిని ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షకు హాజరైంది. అయితే, ఈమె శుక్రవారం అదే ప్రాంతంలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంటినుంచి బయలుదేరి, ఆ తర్వాత ఇంటికిరాలేదు. తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో గాలించారు. ఆమె ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.