నీరా ప్రాజెక్టుకు ధర్మ భిక్షం పేరు పెట్టాలి
ABN , First Publish Date - 2022-08-11T06:01:09+05:30 IST
భువనగిరి మండలం నందనంలో ఏర్పాటు చేస్తున్న నీరా ప్రాజేక్టుకు గీత పని వారల సంఘం జాతీయ నేత ధర్మ భిక్షం పేరును పెట్టాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రజ్యోతి- న్యూస్నెట్వర్క్: భువనగిరి మండలం నందనంలో ఏర్పాటు చేస్తున్న నీరా ప్రాజేక్టుకు గీత పని వారల సంఘం జాతీయ నేత ధర్మ భిక్షం పేరును పెట్టాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇదే డిమాండ్తో తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. సంస్థాననారాయణపుం మండలం నిర్వహించిన కార్యక్రమంలో పందుల యాదగిరి, తండా యాదయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు గుండు వెంకటేశం, జెల్లా జానకిరాములు పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో నాయకులు బాలగోని సత్యనారాయణ, జి.యాదగిరి, బి.నరేష్, ఎల్లయ్య పాల్గొన్నారు. మోత్కూరులో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, గీతపనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య, అన్నెపు వెంకట్, పుల్కరం మల్లేష్, బుర్ర యాదయ్య పాల్గొన్నారు. మోటకొండూరులో నిర్వహించినకార్యక్రమంలో నాయకులు స్వామి, మల్లేశ, సత్యనారాయణ, వంగాల చంద్రమౌళి, బొలగాని అశోక్లు పాల్గొన్నారు.