నీచరాజకీయాలు మానుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T05:55:46+05:30 IST

నీచరాజకీయాలు మానుకోవాలి

నీచరాజకీయాలు మానుకోవాలి
ఓగిరాలలో బాదుడే బాదుడు, ప్రతి ఇంటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టీడీపీ నాయకులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌,  ఆగస్టు 10 : నియోజకవర్గంలో వైసీపీ నాయకులు నీచరాజకీ యాలకు పాల్పడుతూ, ఘర్షణలు సృష్టించటానికి చూస్తున్నారని అలాంటి వారిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఎమ్మె ల్సీ బచ్చుల అర్జునుడు హెచ్చరించారు. ఓగిరాలలో టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వ హించిన బాదుడే బాదుడు, ప్రతి ఇంటికీ తెలుగు దేశం కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు.  నియో జకవర్గంలో టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక సంక్షేమ పథకాల లబ్ధిదారులైన మహిళల తో, యువతతో నీచరాజకీయాలు, రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజలను కాపాడాలన్నారు. వైసీపీ నాయకులు మహిళలను, పేదలను భయపెట్టి ఉసిగొల్పటాన్ని ఆయన ఖండించారు. స్వార్థప్రయో జనాల కోసం ప్రజలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే వైసీపీ నాయకులు గ్రామాల్లో తిరగాలని ఛాలెంజ్‌ చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నందునే ఎమ్మెల్యే వంశీ హైదరాబా ద్‌కు పరిమితమయ్యాడని విమర్శించారు. మహిళ లపై లైంగిక వేధింపులు, జుగుప్సాకరమైన చేష్టలు వైసీపీ నాయకులు చేస్తుంటే కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూజగన్‌మోహనరెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టించడం చేతకాని వైసీపీ ప్రభుత్వం ఉన్నవాటిని పప్పుబెల్లాల్లా పంచుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. గ్రామాల్లో కనీస మౌలికవసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే సమర్థుడైన చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్లీ కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు,  పుట్టా సురేష్‌,  సజ్జా చలమారావు, కగ్గా దుర్గాప్రసాద్‌, మూల్పూరి సాయికల్యాణి, చిరుమామిళ్ల సూర్యం, దండు సుబ్రహ్మణ్యంరాజు, గుండపనేని ఉమా వరప్రసాద్‌, చెన్నుబోయిన శివయ్య, చెరుకూరి రాము, గుత్తా సాంబశివరావు, మజ్జిగ నాగరాజు, మందాడి రవీంద్ర, సాదరబోయిన జ్ఞానేషు, నక్కా కోటయ్య, రాజేష్‌, కొండపావులూరి పండమ్మ, బొమ్మదేవర సత్యన్నారాయణరావు, నాని, తదితరులు పాల్గొన్నారు.

బొమ్ములూరులో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు రూ.50,116 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీకి ఈ విరాళాన్ని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వి.కృష్ణారావు, కార్యదర్శి గుళ్లపూడి ప్రసాద్‌, గండేపూడి నితీష్‌కుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు పిల్లి వెంకటేశ్వరరావు, వీరబాబు, రాట్నాలు, మట్టా మురళి, పచ్చిగళ్ల ఏసుపాదం, ధనుంజయరావు, దాసరి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:55:46+05:30 IST