భక్తుడిగా వచ్చి అమ్మవారి మెడలోని నెక్లెస్ చోరీ
ABN , First Publish Date - 2021-03-05T12:21:33+05:30 IST
భక్తుడిగా వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి మెడలోని నెక్లెస్ దొంగిలించుకుపోయిన
హైదరాబాద్/నిజాంపేట్ : భక్తుడిగా వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి మెడలోని నెక్లెస్ దొంగిలించుకుపోయిన సంఘటన నిజాంపేట్లో చోటుచేసుకుంది. భవ్యాస్ఆనందంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూజారి ఈ నెల 2న ఉదయం 5.30కి తెరిచాడు. ఆలయాన్ని ఊడ్చేవారు వారి పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేశాడు. అదను చూసి అమ్మవారి మెడలోని 6తులాల నెక్లెస్ అపహరించుకుపోయాడు. ఆలయ కమిటీ సభ్యులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.