కరోనాతో 196 మంది వైద్యులు మృతి: ఐఎంఏ

ABN , First Publish Date - 2020-08-08T22:18:26+05:30 IST

కరోనాతో 196 మంది వైద్యులు మృతి: ఐఎంఏ

కరోనాతో 196 మంది వైద్యులు మృతి: ఐఎంఏ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో దాదాపు 200 మంది వైద్యులు కోవిడ్-19తో మృతి చెందినట్లు ఐఎంఏ పేర్కొంది. దేశంలో మొత్తం 196 మంది వైద్యులు, వీరిలో ఎక్కువ మంది జనరల్ ప్రాక్టీషనర్లు ఉన్నారని, ఇప్పటివరకు కోవిడ్ -19 వల్ల చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శనివారం తెలపింది. ప్రతిరోజూ వైద్యులు వ్యాధి బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఐఎంఏ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ప్రత్యేక రిస్క్ గ్రూపుగా ఉన్న వైద్యులు, వారి కుటుంబాలకు తగిన జాగ్రత్తలు అందేలా చూడాలని, అన్ని రంగాలలోని వైద్యులకు రాష్ట్ర ప్రాయోజిత వైద్య, జీవిత బీమా సౌకర్యాలను విస్తరించాలని ఐఎంఏ కోరింది.


Updated Date - 2020-08-08T22:18:26+05:30 IST