Nitish kumar : నేను ముందే చెప్పా..

ABN , First Publish Date - 2021-07-20T00:28:40+05:30 IST

‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు

Nitish kumar : నేను ముందే చెప్పా..

పాట్నా : ‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వస్తున్న వార్తలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. అలా గూఢచర్యం చేయడం పనికిమాలిన వ్యవహారమని అన్నారు. నూతనంగా వచ్చిన సాంకేతికత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ విషయాన్ని తాను కొన్ని రోజుల క్రితం నుంచే చెబుతున్నానని అన్నారు. ‘‘ఇదో చెత్తపని. పనికిమాలిన పని. ఇలా ఇబ్బంది పెట్టడం మంచిపని కాదు. కొత్త సాంకేతికత పరిజ్ఞానం దుర్వినియోగం అవుతోంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి వారి పనులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది’’ అని నితీశ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-20T00:28:40+05:30 IST