అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ డిమాండ్

ABN , First Publish Date - 2021-05-03T01:38:57+05:30 IST

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నేషనలిస్ట్ ...

అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ డిమాండ్

ముంబై: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయ పరీక్షకు ప్రజలు ఇచ్చే తీర్పే నిదర్శనమని ఆ పార్టీ పేర్కొంది. బెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కూడా ఎన్సీపీ గుర్తుచేసింది. ‘‘పశ్చిమ బెంగాల్లో హింస జరిగినప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలని మమత దీదీ కోరారు. అయితే ప్రజలు అడిగితేనే తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి ఎన్నికల తీర్పే కొలమానం. అది అమిత్ షాకి వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి అమిత్ షా.. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు?’’ అంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు.


కాగా ఇవాళ సాయంత్రం 8:00 సమయానికి వెలువడిన ఫలితాల ప్రకారం... బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గానూ టీఎంసీ 195 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే 62 స్థానాలు గెలుచుకుని మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో రెండు చోట్ల ఇతరులు విజయం సాధించారు. 

Updated Date - 2021-05-03T01:38:57+05:30 IST