Sharad pawar: ఈడీపై మళ్లీ విమర్శలు
ABN , First Publish Date - 2021-09-07T22:23:23+05:30 IST
ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మళ్లీ విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను
ముంబై : ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మళ్లీ విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడానికి, రాష్ట్రాల హక్కులను కాలరాయడానికే ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రకు సంబంధించిన నేతలపై ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో పవార్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈడీ దాడులు గానీ, ఈడీ విచారణలు గానీ ఇప్పుడు జరిగినట్లు మహారాష్ట్రలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో ఎన్నడూ ఈడీ విచారణలు ఇలా జరగలేదు. మొదలిసారి ఖడ్సేపై, రెండోసారి అనిల్ దేశ్ముఖ్ను ప్రశ్నించారు. తాజాగా భావనా గవాలిని కూడా విచారించారు. ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడానికే ఇలా చేస్తున్నారు. ఈడీని ఇందుకే ప్రభుత్వం వాడుకుంటోంది’’ అని పవార్ మండిపడ్డారు.