నాయినిచెరువుపల్లెవాసి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-03-07T06:22:16+05:30 IST
పీలేరు మండలం కావలిపల్లె పంచాయతీ లోని మద్దెల చెరువు పాళెం(ఎంసీపాళెం) వద్ద శని వారం రాత్రి దారుణ హత్య జరిగింది.
ఎంసీపాళెం వద్ద దారికాచి చంపేసిన దుండగులు
పీలేరు, మార్చి 6: పీలేరు మండలం కావలిపల్లె పంచాయతీ లోని మద్దెల చెరువు పాళెం(ఎంసీపాళెం) వద్ద శని వారం రాత్రి దారుణ హత్య జరిగింది. కలికిరి మండలం నాయినిచెరువుపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డిని గుర్తుతెలి యని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల కథనం మేరకు.. అవివాహితుడైన వెంకటేశ్వరరెడ్డి (44) ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంసీపాళెం - బోడినాయునిదొడ్డి మార్గంలో స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కత్తితో నరికి గొంతుకోసి పరారయ్యారు. పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ, ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో విరిగిపడి ఉన్న కర్రలు లభించాయి. తొలుత కర్రలతో దాడిచేసి ఆపై కత్తులతో చంపి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ ఇతడిపై హత్యాయత్నం జరిగిందని సమాచారం. ఈ సంఘటన పీలేరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.