బాలాఘాట్‌లో నక్సల్ దంపతుల లొంగుబాటు

ABN , First Publish Date - 2021-06-24T11:41:13+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ అడవుల్లో నక్సల్ దంపతులు చత్తీస్‌ఘడ్ పోలీసుల ముందు లొంగిపోయారు....

బాలాఘాట్‌లో నక్సల్ దంపతుల లొంగుబాటు

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ అడవుల్లో నక్సల్ దంపతులు చత్తీస్‌ఘడ్ పోలీసుల ముందు లొంగిపోయారు. నక్సల్ దంపతులపై రివార్డు ఉందని ఎస్పీ షలబ్ కుమార్ సిన్హా చెప్పారు. నక్సల్ దంపతుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి,నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సిన్హా చెప్పారు. మావోయిస్టులకు భారీ నెట్ వర్క్ ఉందని తేలింది. దీంతో చత్తీస్ ఘడ్ పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. తాము ప్రభుత్వంలో పనిచేయాలని తాము పోలీసుల ముందు లొంగిపోయామని నక్సల్ దంపతులు చెప్పారు. 

Updated Date - 2021-06-24T11:41:13+05:30 IST