నవాబ్ మాలిక్ hydrogen bomb...ఫడ్నవీస్ నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతున్నారంటూ ఆరోపణ

ABN , First Publish Date - 2021-11-10T17:18:59+05:30 IST

మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు నవాబ్ మాలిక్ బుధవారం ఉదయం మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌పై హైడ్రోజన్ బాంబు వేశారు...

నవాబ్ మాలిక్ hydrogen bomb...ఫడ్నవీస్ నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతున్నారంటూ ఆరోపణ

ముంబై :మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు నవాబ్ మాలిక్ బుధవారం ఉదయం  మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌పై హైడ్రోజన్ బాంబు వేశారు. ఫడ్నవీస్ హయాంలో జరిగిన నియామకాలను మంత్రి ప్రశ్నించారు.మహారాష్ట్రలో ఫడ్నవీస్ రక్షణలో నకిలీ కరెన్సీ రాకెట్ కొనసాగుతోందని మాలిక్ ఆరోపించారు. ‘‘ఫడ్నవీస్ ఆశీర్వాదంతో మహారాష్ట్రలో నకిలీ నోట్ల ఆట మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత పలు రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ దొరుకుతున్నప్పుడు, మహారాష్ట్రలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  2017అక్టోబర్ 8 న డీఆర్ఐ దాడులు చేసి రూ.14.56 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. 


అయితే అప్పటి సీఎం ఫడ్నవీస్ కేవలం రూ.8.80 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపడంతో కేసు బలహీనపడింది’’ అని మాలిక్ పేర్కొన్నారు.ముంబైలో అరెస్టయిన నిందితుడు ఇమ్రాన్ ఆలం షేక్ బెయిల్ పొందాడని, ఇతనిపై ఎలాంటి విచారణ జరగలేదని చెప్పారు. ‘‘బీజేపీ నాయకుడు హాజీ అరాఫత్ షేక్ యొక్క తమ్ముడు షేక్ గత ప్రభుత్వంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు’’అని ఎన్‌సీపీ నాయకుడు చెప్పారు.


1993 బాంబ్ బ్లాస్ట్ కేసులో నవాబ్ మాలిక్‌కు ప్రమేయం ఉందంటూ ఫడ్నవీస్ ఆరోపిస్తుండగా.. తాను ఒక్క హైడ్రోజన్ బాంబ్ వేసి దేవేంద్ర ఫడ్నవీస్ కుంభకోణాలన్నీ బయటపెట్టానని మాలిక్ చెప్పారు.కుర్లాలోని గోవాల కాంపౌండ్‌లో ఎన్సీపీ నవాబ్ మాలిక్‌ చాలా తక్కువ ధరకు ఆస్తి కొనుగోలు చేశాడని ఫడ్నవీస్ మంగళవారం ఆరోపించారు.


Updated Date - 2021-11-10T17:18:59+05:30 IST